'జోడో' యాత్రలో రాహుల్ పెళ్లి ప్రస్తావన.. రియాక్షన్ ఎంటో తెలుసా?

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (13:16 IST)
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు వీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ "భారత్ జోడో యాత్ర"ను ప్రారంభించారు. ఈ యాత్రం తమిళనాడు నుంచి జమ్మూకాశ్మీర్ వరకు కొనసాగనుంది. ఇప్పటికే తమిళనాడులో యాత్ర పూర్తికాగా, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది.
 
అయితే, ఈ యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. 'మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని  ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారు. 
 
ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.
 
శనివారం సాయంత్రం యాత్ర కేరళలోకి ప్రవేశించింది. సరిహద్దులో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందని నేతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments