Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీస్ శిక్షణా శిబిరంపై దాడి.. 60 మంది హతం

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాక

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:09 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 
 
ఉగ్రవాదులు ముందుగా వాచ్‌ టవర్‌ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తర్వాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే, ఇతర ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments