భారత్‌లో రైతు నిరసనలకు కెనడా ప్రధాని మద్దతు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:51 IST)
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఢిల్లీ బయట పోలీసుల లాఠీచార్జిలు, బాష్పవాయువులు, వాటర్‌ ట్యాక్‌లు, ఫిరంగులను సైతం లెక్కచేయకుండా తీవ్రమైన చలిలోనూ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలు చేస్తున్న ఈ నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు. భారత్‌లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పరిస్థితికి చింతిస్తున్నానని తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించామని చెప్పారు. అందరమూ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదేనని అన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రూడో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.
 
కాగా కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. కెనాడా ప్రధాని ట్రూడోవ్‌ తప్పుడు సమాచారంతో వ్యాఖ్యలు చేశారని, అసలు ఆయన స్పందించాల్సిన అవసరమే లేదని పేర్కొంది. రైతుల ఆందోళనలనేది తమ దేశ అంతర్గత వ్యవహారమని, అందులో జోక్యం చేసుకోవడం తగదని విదేశాంగ శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments