Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో జీవించివున్న ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె..?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (12:07 IST)
ఒకపుడు శ్రీలంక దేశాన్ని గడగడలాడించిన ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె ప్రాణాలతో జీవించివున్నట్టు ఓ వీడియో విడుదలైంది. ఇది ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ ఈలం కోరుతూ శ్రీలంకలో జరిపిన అంతర్యుద్ధంలో ఎల్టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్ 2009లో ఆ దేశ సైన్యం చేతిలో హతమైన విషయం తెల్సిందే. అలాగే, ఈ యుద్ధంలో ప్రభాకరన్ భార్య మదివదని, ఇద్దరు కుమారులు, కుమార్తె ద్వారక తదితరులు మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించింది. 
 
అయితే, ప్రభాకరన్ ప్రాణాలతోనే ఉన్నారని పలువురు వివిధ సందర్భాల్లో ప్రకటించినా వాటిని శ్రీలంక సైన్యం ఖండించింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లో ఉంటున్న తారకా హరిధరన్ అనే మహిళ తాను ప్రభాకరన్ భార్య మదివదని సోదరినని చెబుతూ వీడియో విడుదల చేశారు. అందులో మదివదని, ప్రభాకరన్ కుమార్తె ద్వారక బతికే ఉన్నారని పేర్కొనడం సంచలనంగా మారింది. 
 
మరోవైపు శ్రీలంక సామాజిక మాధ్యమాల్లో సైతం ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ దేశంలో సర్వ మక్కల్ కట్చి అనే సంస్థను నిర్వహిస్తున్న ఉదయకళ అనే మహిళనే ప్రభాకరన్ కుమార్తె ద్వారకా అని అందులో పేర్కొన్నారు. ద్వారకా తన పేరుని ఉదయకళగా మార్చుకుని తమిళనాడులో ఆశ్రయం పొంది ప్రస్తుతం శ్రీలంకలో ప్రజాసేవ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments