Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌పై కేసు.. ప్రజలను రెచ్చగొట్టి.. సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించారట..

పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినంద

Webdunia
శనివారం, 6 మే 2017 (14:15 IST)
పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ అయిన ఐఎం పాకిస్థాన్ పార్టీ ఛైర్మన్, న్యాయవాది ఇష్తియాక్ అహ్మద్ మీర్జా రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
ఆ ఫిర్యాదులో తనకు వాట్సాప్‌ ద్వారా ఓ వీడియో అందిందని.. అందులో ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్లుందని చెప్పారు. ఆయన మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా.. సైనిక దళాల మీద విద్వేషాన్ని సృష్టించేలా ఉన్నాయన్నారు. అందుకే పీఎంఎల్ఎన్ పార్టీ అధినేత, పాక్ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధానిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాలేదు. స్థానికంగా దాన్ని ''రోజ్‌నామ్చా" అంటారని పాకిస్థాన్ పత్రిన డాన్ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments