Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై పందులు దాడి... మృతి... పందులకు మరణ శిక్ష

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (13:18 IST)
తప్పు చేస్తే... అది హత్యలు వంటి వాటికి పాల్పడితే మనుషులకు మరణ దండనలు విధించడం మనకు తెలిసిన విషయమే. 15వ శతాబ్దంలో తప్పు చేసిన జంతువులను కూడా శిక్షించేవారని పరిశోధకులు పేర్కొంటున్నారు. అప్పట్లో ఫ్రాన్స్ దేశంలో జంతువులను కూడా మనుషుల్లానే భావించి నేరం చేసిన జంతువులను బంధించి విచారించి శిక్ష విధించి అమలు జరిపేవారట.
 
దీనికి ఓ ఉదాహరణను కూడా ఉటంకించారు. అదేమిటంటే... ఫ్రాన్స్ లోని సావిగ్నీ అనే గ్రామంలో ఆరు పందులు ఐదేళ్ల బాలుడిపై దాడిచేసి అతడి మృతికి కారణమయ్యాయి. ఈ దుర్ఘటన తెలుసుకున్న భద్రతా సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
 
బాలుడి మృతికి ఆ ఆరు పందులు కారణమని నేరం నిర్థారణ కావడంతో వాటికి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు వాటికి మరణ దండన విధించారు. ఇలాంటి మరణ శిక్షలు కేవలం పందులకే కాదు... అప్పట్లో కుక్కలు, ఏనుగులు... ఇతర జంతువులకు నేర స్థాయిని బట్టి శిక్షలు విధించేవారట.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments