Webdunia - Bharat's app for daily news and videos

Install App

People for sale: మనుషులను అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు...

ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (10:01 IST)
ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా రాతియుగపు ఆనవాళ్లను అలాగే మోసుకెళుతున్నాం. సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా మనుషులను కూడా కొనుక్కు వెళుతున్నారు జనం. లిబియా రాజధాని ట్రిపోలీలో జరుగుతున్న ఈ బానిస వ్యాపారం… ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. 
 
సంక్షోభాలతో అతలాకుతలమైన ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు వలసపోతున్న శరణార్థుల్ని లిబియా స్మగ్లర్లు అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఒక్కోవ్యక్తిని రూ.20 నుంచి రూ.30 వేల వరకు వెలకట్టి అమ్మేస్తున్నారు. రోజువారీ కూలీల కింద విక్రయిస్తున్నారు. కొన్న వ్యక్తులు వీరిని వ్యయసాయ పనులు లేదా నిర్మాణ రంగం తదితర పనుల కోసం తీసుకువెళుతున్నారు. 
 
ఆరోగ్యంగా ఉండి, కండబలం ఎక్కువగా ఉన్న యువకులు ఎక్కువ రేటు పలుకుతున్నారు. స్మగ్లర్ల పడవలపై ఐరోపా దేశాలు విరుచుకుపడుతుండటంతో.. శరణార్థుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో దిక్కుతెలియని స్మగ్లర్లు వారిని వేలంలో విక్రయించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments