Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (10:38 IST)
పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో దారుణం జరిగింది. సంసార బాధ్యతలు విస్మరించి హింసిస్తున్న భర్త నుంచి వేరుపడేందుకు విడాకుల కావాలంటూ ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తండ్రి... తమ కుటుంబ పరువు తీస్తుందంటూ కుమార్తెపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, గొడ్డలితో ఆమె కాళ్లు నరికేశాడు. కరాచీకి చెందిన బాధిత మహళ తండ్రి సయ్యద్ ముస్తఫా షా.. మామలు సయ్యద్ ఖుర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్, ముస్తాక్ షా కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరందరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తన భర్త నిత్యం వేధించేవాడని, ఇద్దరు పిల్లలను ఏనాడూ పట్టించుకోలేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు కూడా ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలు సోబియా బతూత్ షా వాపోయింది. దీంతో అతడి నుంచి విడిపోవాలనుకుని విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పింది. ఇది తమ కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించిందని, భర్తపై కోర్టుకెక్కడం ద్వారా కుటుంబానికి చెడ్డపేరు తెస్తోందని భావించిన సోబియా కుటుంబ సభ్యులంతా కలిసి దారుణానికి పాల్పడ్డాడు. కష్టాల్లో ఉన్న కుమార్తెకు అండగా నిలబడాల్సిన తండ్రి.. గొడ్డలితో కుమార్తె కాళ్లు నరికి వేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు రావాలంటే ఓ షరతు వుంది !

పోటాపోటీగా వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. పాత్రలు !

కౌన్ బనేగా కరోడ్‌పతిలో పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న - రూ.1.60 లక్షల ప్రైజ్‌మనీ

సెల్ఫీ కోసం వచ్చిన వారికి క్షమాపణలు చెప్పిన రవీనా టాండన్

ప్రభాస్ చిత్రం నుంచి అర్థాంతరంగా తొలగించారు : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments