Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి భర్త : ఉద్యోగం చేస్తోందనీ భార్య తల నరికేశాడు

పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఉద్యోగానికి వెళ్లొద్దు... ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పినా భార్య పట్టి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (17:01 IST)
పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఉద్యోగానికి వెళ్లొద్దు... ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పినా భార్య పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కసాయి భర్త.. కత్తితో తల నరికేశాడు. ఈ దారుణం పాకిస్థాన్ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌, రాయ్‌విండ్ అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాయ్‌విండ్‌ ప్రాంతంలో అఫ్రహీం, నస్రీన్ అనే దంపతులు ఉన్నారు. వీరిలో నస్రీన్ స్థానికంగా ఉండే ఓ కర్మాగారంలో పనిచేస్తోంది. అయితే, భార్య పని చేయడం అఫ్రహీంకు ఏమాత్రం ఇష్టంలేదు. దాంతో పలుమార్లు ఉద్యోగం మానేయాలంటూ చిత్రహింసలు పెట్టేవాడు. 
 
ఈనేపథ్యంలో శనివారం ఇద్దరి మధ్య ఉద్యోగం విషయమై వివాదం చోటుచేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన అఫ్రహీం.. ఆమె న్రిదపోతుండగా గది తలుపులు మూసేసి ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికేశాడు. 
 
ఆదివారం ఉదయం పిల్లలు లేచి చూడగా తల్లి జీవచ్ఛవంలాపడి ఉండడం చూసి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. వారుపోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు అఫ్రహీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments