Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కాళ్ళబేరం... ప్లీజ్.. యుద్ధం వద్దు.. మాట్లాడుకుందాం రండి.. నవాజ్ షరీఫ్ నోట...శాంతి మాట..!

యురీ దాడి ఘటన తర్వాత భారత్ చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలొగ్గింది. దీంతో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడంతో బెంబేలెత్తిపోయింది. దీంతో పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:41 IST)
యురీ దాడి ఘటన తర్వాత భారత్ చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలొగ్గింది. దీంతో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడంతో బెంబేలెత్తిపోయింది. దీంతో పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది. 
 
ఇదే అంశంపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. శాంతి మంత్రం వల్లించారు. 'ఇస్లామాబాద్ శాంతిని కోరుకుంటోంది. అయితే పాకిస్థాన్‌కు ఎవరు కీడు తలపెట్టినా వారి ఆటలు సాగనీయం' అని నవాజ్‌ శుక్రవారం అన్నారు. జమ్మూకశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని తన మంత్రివర్గ సహచరులతో సమీక్షించిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రేడియా పాకిస్థాన్ పేర్కొంది.
 
అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్న పాక్ శాంతిని కోరుకుంటోందని, అయితే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పాకిస్థానీ కంకణబద్ధులై ఉంటారని అన్నారు. దేశం యావత్తూ సైనిక బలగాలకు అండగా నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, పేదరికం, నిరుద్యోగితపై పోరాటానికి పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్టు నవాజ్ తెలిపారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments