Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మేరా దోస్త్.. స్నేహాస్తం సాచిన నవాజ్ షరీఫ్!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (17:43 IST)
భారత్ తమ దాయాది నేస్తమంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ స్నేహాస్తం సాచారు. తాము ఒక్క భారత్‌తోనే కాకుండా సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటితో మంచి సంబంధాలు కోరుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు.
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూఢిల్లీ పర్యటన తర్వాత శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడటాన్ని ఆ రెండు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.
 
ఈ నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్ వెళ్లి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ముఖ్యమైన పొరుగు దేశమంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
 
ఇందులో ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థితిని షరీఫ్‌కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల మధ్య జమ్మూకాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించినట్టు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments