Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రిని: హిందువులకు షరీఫ్ గుడ్ న్యూస్

పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాలను కాపాడాలని, యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తాను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రినని స్పష్టం చేశ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (17:37 IST)
పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాలను కాపాడాలని, యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తాను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రినని స్పష్టం చేశారు. పాకిస్థాన్ త్వరలోనే మైనారిటీల మిత్ర దేశంగా గుర్తింపు పొందుతుందని షరీఫ్ ఉద్ఘాటించారు. హిందువుల పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన కటాస్ రాజ్ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడుతూ తమ దేశంలో అన్ని మతాల వారికీ సమాన హక్కులు ఉండేవిధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ చర్యలు మెజారిటీలను, మైనారిటీలను సమానంగా చూడాలన్న ఇస్లామిక్ సిద్ధాంతంలో భాగమన్నారు. పాకిస్థాన్ ప్రశాంతంగా, సౌభాగ్యవంతంగా ఉండేందుకు ముస్లింలు, హిందువులు, సిక్కులు, పార్శీలు, బహాయిలు, క్రైస్తవులు చేతిలో చేయి వేసి కృషి చేస్తున్నారని, దేశాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కటాస్ రాజ్ కాంప్లెక్స్‌లో 'అమృత్ జల్' పేరుతో రక్షిత మంచినీటి ప్రాజెక్టును నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఓ మొక్కను కూడా నాటారు.
 
ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉన్న చక్వాల్‌ జిల్లాలోని కటాస్ రాజ్ కాంప్లెక్స్‌ పునరుద్ధరణకు బుధవారం నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిన్నరలోగా ఈ దేవాలయం పునరుద్ధరణ జరగాలని గడువు విధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments