Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రరిస్టులపై పాక్ ఉక్కుపాదం : ఒక్క ఇస్లామాబాద్‌లోనే 300 మంది అరెస్టు!!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (17:40 IST)
తనదాకా వస్తేకానీ తెలియదన్న సామెతను నిజం చేస్తూ పెషావర్ దాడి తర్వాత పాకిస్థాన్ భద్రతాల బలగాలు తీవ్రవాదులపై విరుచుకుపడుతున్నాయి. పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత పాక్ సైనిక బలగాలతో పాటు ఆ దేశ ప్రభుత్వం కూడా మొద్దు నిద్రను వీడింది. 
 
పెషావర్ దాడి జరిగి 48 గంటలు తిరగకముందే జైళ్ళలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని ఆ దేశ సైనిక చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫైసలాబాద్‌లో నలుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేసింది. అలాగే, తీవ్రవాదులపై పగబట్టేశాయా అనే రీతిలో దేశవ్యాపంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజులోనే ఇస్లామాబాద్ చేపట్టిన గాలింపు చర్యల్లో తీవ్రవాద అనుమానిత వ్యక్తులుగా భావిస్తున్న 300 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 
 
దీంతో పాకిస్థాన్ భద్రతా బలగాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్‌లో తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని, ఏ చిన్న వేరును మిగిల్చినా, అది ఆ దేశ భద్రతా బలగాలకు పెను సవాలు విసురుతుందని హెచ్చరిస్తున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

Show comments