Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రకోట భారత్‌ది కాదు.. పాకిస్థాన్‌ది : చైనా చాయాచిత్రాల పదర్శనలో అపశృతి

చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది పాకిస్థాన‌కు చెందినది పేర్కొంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (13:18 IST)
చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది పాకిస్థాన‌కు చెందినది పేర్కొంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆ దేశానికి చెందిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమానికి భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాక్ ప్రతినిధి మసూద్ ఖలీద్‌లు హాజరయ్యారు. ఇందులో ఓ ఛాయాచిత్రాన్ని లాహోర్‌లోని షాలిమార్ గార్డెన్స్‌గా నిర్వాహకులు పేర్కొన్నారు. దాన్ని చూసిన భారత్, పాక్ ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. ఆ ఛాయాచిత్రం ఏమిటంటే... ఢిల్లీలోని మన ఎర్రకోట. ఎర్రకోటపై మన మువ్వన్నెల జెండా కూడా ఎగురుతుండటం గమనార్హం.
 
దీంతో, వెంటనే ఈ విషయాన్ని నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లాకగనీ, వారు నిద్రమేల్కోలేదు. ఆ తర్వాత ప్రదర్శన నిర్వాహకులపై వారు మండిపడ్డారు. ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నప్పుడు, ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో, జరిగిన తప్పుకు నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments