Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సింధు' ఒప్పందాన్ని గెలికితే నదుల్లో రక్తం ప్రవహిస్తుంది : హఫీజ్ సయీద్ హెచ్చరిక

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ రే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హెచ్చరిక చేశారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం జోలికి వస్తే రక్తపాతమే సృష్టిస్తామని హఫీజ్ సయీద్

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (15:06 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ రే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హెచ్చరిక చేశారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం జోలికి వస్తే రక్తపాతమే సృష్టిస్తామని హఫీజ్ సయీద్ ప్రకటించారు. 
 
కాశ్మీర్‌లోని అక్నూర్, ఉరి దాడులతో పాకిస్థానీ ముజాహిదీన్ కమాండర్లు భారత్‌కు ధీటైన జవాబిచ్చారంటూ శుక్రవారం ప్రకటించిన సయూద్... తాజాగా సింధూ జలాల ఒప్పందంపైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. లాహోర్‌కి 130 కిలోమీటర్ల దూరంలో ఫైసలాబాద్‌లో జరిగిన కాశ్మీరీ కాన్ఫరెన్స్ ర్యాలీలో సయూద్ ప్రసంగిస్తూ సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. 
 
పాకిస్థాన్‌కు నదీ జలాలను భారత్ నిలిపివేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉరి సైనికశిబిరంపై దాడులు జరిపిన అనంతరం సింధూ జలాల ఒప్పందంపై పున:పరిశీలన జరపాలని, సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు చట్టబద్ధంగా భారత్‌కే చెందినవని, వ్యర్థ జలాలను పాకిస్థాన్‌కు వదలకుండా నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్ 25న హెచ్చరించారు. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments