Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే.. భారీ నష్టమే: ఆసిఫ్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:22 IST)
భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్‌తో ఎటువంటి యుద్ధానికైనా సరే, తాము సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ సవాల్ విసిరారు. 
 
రేడియో పాకిస్థాన్ కార్యక్రమంలో ఆసిఫ్ పాల్గొన్నారు. శాంతి స్థాపనపై తమకు నమ్మకం ఉందని, అయితే దురుసుగా వ్యవహరిస్తే ఏవిధంగా సమాధానం చెప్పాలో కూడా తమకు తెలుసని ఆసిఫ్ హెచ్చరించారు. కాగా, భవిష్యత్‌లో చిన్నాచితక యుద్ధాలు రావచ్చని సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల భారత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థాన్ మంత్రి పైవిధంగా కామెంట్ చేయడం గమనార్హం. 
 
గతంలో జరిగిన యుద్ధాలను గుర్తు చేసిన ఆసిఫ్..  1965లో లాహోర్‌ను ఆక్రమించామని.. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఎదురవుతుందన్నారు. పాకిస్థాన్ 50 ఏళ్ల కంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగివుందని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ సైన్యం కొన్నేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉందని ఆసిఫ్ గుర్తు చేశారు. తద్వారా భారత్‌కు బలమైన హెచ్చరికలను ఆసిఫ్ పంపారు. మరి భారత్ ఈ వ్యాఖ్యలపై ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments