Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఇళ్లపై కూలిన విమానం : 107 మంది దుర్మరణం

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:22 IST)
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 107 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి కరాచీలో జిన్నా అంతర్జాతీయ విమానశ్రయం వద్ద ఎయిర్‌పోర్టుకు 4 కిలోమీటర్ల సమీపంలో కుప్పకూలిపోయింది. 
 
ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 100 మంది ప్రయాణికులతో పాటు.. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ విమానం జిన్నా విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి.. విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలోనే కుప్పకూలిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ విమాన ప్రమాదం జనావాసాల్లో జరగడంతో అనేక గృహాలు కూడా ధ్వసంమయ్యాయి. అయితే, ఈ గృహాల్లోని ప్రజల సంగతి తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments