భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (11:30 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని అయినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్వేదం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆయన నైరాశ్యం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి 2023కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ట్రూత్ సోషల్ వేదికగా పెట్టిన ఓ పోస్టులో ట్రంప్ ఇలా పేర్కొన్నారు. 
 
కాంగో రువాండ్ మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్న ఆయన అందుకు చాలా సందోషంగా ఉన్నారన్నారు. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఇరు వర్గాలు ఒప్పందపత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్‌కు రానున్నట్టు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఇది ఆఫ్రికా, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే, తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించిందన్నారు. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య లేదా సెర్బియా కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని అసహనం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments