Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్‌ విడుదలపై అమెరికా ఆందోళన... పాక్‌కు వార్నింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షం

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (13:07 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. హఫీజ్ చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకొని మళ్లీ అరెస్టుచేయాలని కోరింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
'లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అగ్రనేత పాకిస్థాన్‌లో గృహనిర్బంధం నుంచి విడుదల కావడంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. సయీద్‌ ఆధ్వర్యంలోని ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోనే అనేకచోట్ల మారణహోమం సృష్టించి అమెరికా సహా అనేకచోట్ల అమాయకుల్ని బలితీసుకున్నాయి. అందువల్ల పాకిస్థాన్ అతడిని మళ్లీ అరెస్టుచేయాలి' అని ఆ కార్యాలయ ప్రతినిధి హ్యాథర్‌ న్యూరెట్‌ డిమాండ్‌ చేశారు.
 
ముంబై దాడుల సూత్రధారి అయిన సయీద్‌ను జనవరి 31 నుంచి పాక్‌ నిర్బంధంలో ఉంచింది. నవంబర్‌ 23వ తేదీతో అతడి నిర్బంధ గడువు ముగియడంతో అతడిని శుక్రవారం అర్థరాత్రి విడుదలచేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సయీద్‌ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments