Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ రిపోర్టర్ సాహసం ... మెడలోతు నీటిలో నుంచి రిపోర్టింగ్ (Video)

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:37 IST)
పాకిస్థాన్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఆ దేశంలో కురిసిన భారీ వర్షాలు దెబ్బకు గత 30 యేళ్ళలో ఎన్నడూ చూడని విధంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్ట్ పెద్ద సాహసమే చేశారు. మెడలోతు నీటిలో దిగిన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేశాడు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ రిపోర్టర్ ఇంత పెద్ద సాహసం చేశారు. ఈ కవరేజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
తమ దేశంలో నెలకొన్న వరద వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించేందుకు ఆ రిపోర్టల్ మెడలోతు నీటిలో దిగారు. అతని శరీరం మొత్తం నీటిలో మునిగిపోయింది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావానికి, పనితీరుకు ఈ వీడియో నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
అలాగే రిపోర్టర్ ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌పై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్" అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఈ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన సాహసం సోషల్ మీడియాలో పుణ్యమాని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments