Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ రిపోర్టర్ సాహసం ... మెడలోతు నీటిలో నుంచి రిపోర్టింగ్ (Video)

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:37 IST)
పాకిస్థాన్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఆ దేశంలో కురిసిన భారీ వర్షాలు దెబ్బకు గత 30 యేళ్ళలో ఎన్నడూ చూడని విధంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్ట్ పెద్ద సాహసమే చేశారు. మెడలోతు నీటిలో దిగిన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేశాడు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ రిపోర్టర్ ఇంత పెద్ద సాహసం చేశారు. ఈ కవరేజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
తమ దేశంలో నెలకొన్న వరద వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించేందుకు ఆ రిపోర్టల్ మెడలోతు నీటిలో దిగారు. అతని శరీరం మొత్తం నీటిలో మునిగిపోయింది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావానికి, పనితీరుకు ఈ వీడియో నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
అలాగే రిపోర్టర్ ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌పై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్" అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఈ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన సాహసం సోషల్ మీడియాలో పుణ్యమాని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments