Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశం దివాళీ తాసింది.. : పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (11:07 IST)
పాకిస్థాన్ రక్షణ మంత్రి, పీఎంఎల్ ఎన్ పార్టీ కీలక నేత ఖ్వాజా మొహ్మద్ ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. తమ దేశం దివాళా తీసిందని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలంగా, చర్చనీయాంశంగా మారాయి.
 
"మనం ఇపుడు దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నాం. పాకిస్థాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉందన్న వార్తలు మీరందరూ వినే ఉంటారు. కానీ, ఇది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇపుడు మనం మళ్లీ మనకాళ్లపై నిలబడాలి. ఈ సమస్యకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది" అని అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుని పోవడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ చర్యలేనిని ఆయన ఆరోపించారు. ఆయన ఆరంభించిన ఆట కారణంగా ఉగ్రవాదమే పాకిస్థాన్ గమ్యంగా మారిందని వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ అసాధారణ స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments