Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణ్వాయుధాలున్నాయ్.. భారత్‌కు బుద్ధి చెప్తాం.. ఉగ్రవాదం పోరు జరుగుతోంది: పాక్ ప్రధాని

భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:35 IST)
భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాకిస్థాన్.. ఈసారి బహిరంగంగా హెచ్చరించింది. భారత సైన్యానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు తమ దేశం తక్కువ శ్రేణి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్లు పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖఖాన్‌ అబ్బాసీ చెప్పారు. 
 
అమెరికాలోని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో అబ్బాసీ మాట్లాడుతూ.. తమ వద్ద అత్యంత భద్రమైన వ్యవస్థతో కూడిన అణ్వాయుధాలున్నాయని చెప్పారు. సమయం కోసం వేచి చూస్తున్నామని.. తమ వద్ద వున్న అణ్వాయుధాలు సామర్థ్యం తక్కువైనప్పటికీ.. వాటి తాము అభివృద్ధి చేశామన్నారు.
 
అంతేగాకుండా పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ వ్యూహాలకు గట్టిగా సమాధానం చెప్తామని అబ్బాసీ అన్నారు. తమదేశానికి అణు సామర్థ్యం వుందని.. 1960ల్లోనే అణు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అబ్బాసీ అన్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం కాదన్నారు. పాకిస్థాన్‌ ఓ బాధ్యతాయుతమైన దేశమన్నారు. గత 15ఏళ్లుగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ అలుపెరగని పోరాటం చేస్తూనే వుందని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments