Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజియంలు మారనున్న బాలీవుడ్ నట దిగ్గజ నివాసాలు!

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (18:56 IST)
పాకిస్తాన్ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో నట దిగ్గజాలుగా ఖ్యాతిగడించిన వెటర్న్ హీరోలు దిలీప్ కుమార్, రాజ్‌కుమార్ నివాసాలను మ్యూజియంలుగా మార్చాలని నిర్ణయించింది. 
 
భారతదేశ విభజనకు పూర్వం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఈ ఇద్దరు జన్మించారు. పైగా, వారి కుటుంబ సభ్యులకు చెందిన భవనాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. 
 
ఇపుడు ఈ భవనాలను వాటిని మ్యూజియంలుగా మార్చాలని స్థానిక ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాలను కొనుగోలు చేసేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది.
 
దీనిపై ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు కమ్రాన్ బంగాష్ మాట్లాడుతూ, పెషావర్‌లోని దిలీప్ కుమార్ నివాసం, రాజ్ కుమార్‌కు చెందిన భవంతిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశారని, వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. 
 
దేశవిభజనకు పూర్వం ఉన్న సంస్కృతిని పునరుజ్జీవింప చేయడం, పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments