మ్యూజియంలు మారనున్న బాలీవుడ్ నట దిగ్గజ నివాసాలు!

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (18:56 IST)
పాకిస్తాన్ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో నట దిగ్గజాలుగా ఖ్యాతిగడించిన వెటర్న్ హీరోలు దిలీప్ కుమార్, రాజ్‌కుమార్ నివాసాలను మ్యూజియంలుగా మార్చాలని నిర్ణయించింది. 
 
భారతదేశ విభజనకు పూర్వం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఈ ఇద్దరు జన్మించారు. పైగా, వారి కుటుంబ సభ్యులకు చెందిన భవనాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. 
 
ఇపుడు ఈ భవనాలను వాటిని మ్యూజియంలుగా మార్చాలని స్థానిక ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాలను కొనుగోలు చేసేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది.
 
దీనిపై ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు కమ్రాన్ బంగాష్ మాట్లాడుతూ, పెషావర్‌లోని దిలీప్ కుమార్ నివాసం, రాజ్ కుమార్‌కు చెందిన భవంతిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశారని, వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. 
 
దేశవిభజనకు పూర్వం ఉన్న సంస్కృతిని పునరుజ్జీవింప చేయడం, పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

Ankit Koyya: బ్యూటీ ప్రతీ ఇంట్లో, ప్రతీ వీధిలో జరిగే కథ : అంకిత్ కొయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments