Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (11:45 IST)
పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని.. వీరు భారత్‌లోకి చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు. 
 
ఇదే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత జఠిలం కానున్నాయని.. ఇంకా హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని తద్వారా భారత్ అప్రమత్తంగా ఉండాలని అమెరికా నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
గత ఏడాది జరిగిన పఠాన్ కోట్, యూరీ ఘటనలను గుర్తు చేసిన కోట్స్.. ఈ ఘటనలకు పాల్పడింది.. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులేనని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల వల్ల భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయన్నారు. తమ దేశంలోని ఉగ్ర మూలాలను ఏరిపారేయడంలో పాకిస్థాన్ తీవ్రంగా విఫలమవుతోందని.. తద్వారా ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments