Webdunia - Bharat's app for daily news and videos

Install App

హద్దుమీరారో.. తాటతీస్తాం... భారత్‌‌‌‌‌‌‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక

భారత ఆర్మీ చీఫ్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దుమీరితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదేసమయంలో భారత్ చేసిన సర్జికల్‌ దాడులు బూటకమని కొట్టిపారేశారు.

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (08:43 IST)
భారత ఆర్మీ చీఫ్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దుమీరితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదేసమయంలో భారత్ చేసిన సర్జికల్‌ దాడులు బూటకమని కొట్టిపారేశారు.
 
శుక్రవారం ఇస్లామాబాద్‌లో భద్రతాదళాలతో రహీల్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన కాశ్మీరీలపై భారత సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని, వాటి నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకే సర్జికల్‌ దాడుల డ్రామా అడుతోందని విమర్శించారు. ప్రభుత్వంతో పాక్‌ ఆర్మీకి విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన 'డాన్' పత్రిక కథనాన్ని భేటీ ఖండించింది. 
 
కాగా ఈ కథనాన్ని రాసిన జర్నలిస్టు విదేశీ పర్యటనలపై విధించిన నిషేధాన్ని శుక్రవారం ఎత్తివేశారు. కాగా, సర్జికల్‌ దాడులపై పాక్‌ మీడియా కల్పిత కథనాలను వండివారుస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ స్పష్టం చేశారు. 'ద న్యూస్‌ ఇంటర్నేషనల్' పత్రిక కథనం కల్పితమన్నారు.
 
మరోవైపు.. జమ్ముకాశ్మీర్‌ శ్రీనగర్ శివార్లలోని జకురా ప్రాంతంలో ఎస్ఎస్‌బి జవాన్ల కాన్వాయ్‌‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సాయంత్రం 7.30 గంటల  సమయంలో విధులు ముగించుకుని ఆరు వాహనాల్లో వెళ్తున్న జవాన్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. కాన్వాయ్‌లోని చివరి వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారు. ఒక జవాన్ చనిపోయారు. మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments