Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్రావాలు చేసే వైద్యుడి ఇంట.. 2వేలకు పైగా పిండాలు..

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:53 IST)
అబార్షన్లు చేసే ఓ వైద్యుడి ఇంట రెండు వేలకు పైగా మెడికల్ పరంగా భద్రపరిచిన పిండాలను పోలీసులు గుర్తించడం అమెరికాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉల్‌రిచ్ క్లోప్‌ఫెర్ అనే వైద్యుడు ఈ నెల మూడో తేదీన మరణించాడు. 
 
ఇండియానాలోని సౌత్​బెండ్​లో ఒక అబార్షన్​ క్లీనిక్​లో ఆయన సుదీర్ఘ కాలంగా డాక్టర్​గా పనిచేశాడు. పేషెంట్ల రిజిస్టర్​ను సరిగ్గా మెయింటైన్​ చేయకపోవడం మెడికల్​ అబార్షన్​ పాలసీలను ఉల్లఘించడం వంటి వాటికి సంబంధించి ఈ క్లీనిక్​పై ఇండియానా స్టేట్​ డిపార్ట్​మెంట్​ఆఫ్ హెల్త్​కు అనేక కంప్లయింట్లు అందాయి. 
 
అబార్షన్​కు ముందు 18 గంటల పాటు పేషెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సిలింగ్​ను ఇవ్వడం లేదని మెడికల్​ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో 2015లో ఈ హాస్పిటల్​ లైసెన్స్​ను అధికారులు రద్దు చేశారు. ఇండియానాలో అతి ఎక్కువ అబార్షన్లు చేసిన డాక్టర్​గా క్లోప్ ఫెర్​‌కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా చాలా క్లీనిక్స్​లో అతడు వేలాది ఆపరేషన్లు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో గత వారం కోప్​ఫెర్​ మరణించిన తర్వాత అతడి ఇంట్లో పిండాలను గుర్తించిన ఫ్యామిలీ మెంబర్లు షెరీఫ్ ఆఫీసుకు సమాచారం అందించారు. పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఎలాంటి మెడికల్​ ప్రొసీజర్​ నిర్వహించిన ఆధారాలు లేవన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments