Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో పడవ మునక... వందమంది మృతి

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (19:47 IST)
Ship
కాంగోలో పడవలు మునిగిపోవడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా మరో పడవ కూడా నదిలో మునకేసింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించారు. కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. 100 మంది పైగా మునిగిపోగా.. 51 మృతదేహాలు ఇప్పటివరకు బయటకు తీశారు. 
 
ప్రమాదం నుంచి 39 మంది సురక్షితంగా బయటపడ్డారు. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదాన్ని వాయవ్య ప్రావిన్స్ మొంగాలా గవర్నర్ అధికార ప్రతినిధి నెస్టర్ మగ్బాడో ధ్రువీకరించారు.
 
పడవ ఎక్కే ముందు ప్రయాణికులను లెక్కించలేదని గవర్నర్‌ ప్రతినిధి మగ్బాడో చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో, పడవ సీటింగ్ సామర్థ్యాన్ని చూసి తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేస్తున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. 
 
సాధ్యమైనంత ఎక్కువ మందిని సజీవంగా రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. రాత్రి సమయంలో చెడు వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని లేదా పడవలో రద్దీ కూడా కారణం కావచ్చునని మగ్బాడో చెప్పారు. ప్రావిన్షియల్ అధికారులు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments