Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాలకు అడ్డుకట్ట వేసిందనీ తల్లిని హత్య చేసిన తనయుడు

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (09:47 IST)
నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఓ కన్నతల్లిని కన్నబిడ్డే హత్య చేసింది. కేవలం తన సరదాలకు అడ్డు చెప్పిందన్న అక్కసుతో తనయుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని నార్త్ కరోలోనా రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం నళిని తేలప్రోలు (51) అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిగ్భ్రాంతికి గురిచేసే నిజం వెలుగు చూసింది. ఈ హత్య కేసులో కన్నబిడ్డే అసలైన ముద్దాయి అని తేల్చారు. 
 
'చదువంటే పెద్దగా ఇష్టంలేని తనకు సరదాలు, జల్సాలంటే అమితమైన ఇష్టం. వీటికి తన తల్లి అడ్డుకట్ట వేసింది. దీంతో ఆమెపై ఆగ్రహం పెరిగింది. ఈ క్రమంలో 2015 నవంబరులో తన తండ్రి వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పిజ్జాకు ఆర్డర్ ఇచ్చే సమయంలో తనకు, తన తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారుడు ఆర్నవ్‌పై నళిని చేయి చేసుకుంది. 
 
దీన్ని భరించలేక తల్లిని చంపేసి, మృతదేహాన్ని కారులోకి ఎక్కించలేక అక్కడే వదిలేసినట్టు 16 యేళ్ళ ఆర్నవ్ ఉప్పలపాటి వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, హత్య జరిగినపుడు ఆర్నవ్ వయసు 16 యేళ్లు. దీంతో అతన్ని అరెస్టు చేయలేదు. ఈ క్రమంలో ఈ కేసు విచారణ పూర్తికాగా, ప్రస్తుతం అతని వయసు 19 యేళ్లు. ఈ కేసులో ముద్దాయిగా తేలాడు. దీంతో అతనికి 12 నుంచి 15 యేళ్ళపాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments