Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంత చేతికి చేరిన మరో ప్రమాదకరమైన ఆయుధం!!

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (16:54 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడుగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం ప్రపంచంలోని దేశ నియంతల్లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి ఆయన చేతిలోకి మరో ప్రమాదకరమైన ఆయుధం చేరింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీ కొట్టడం, ఆపై భారీ పేలుడు చోటుచేసుకోవడం.. తదితర ఘటనలకు సంబంధించిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి.
 
మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని కిమ్ చెప్పారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments