Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:31 IST)
రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా పరీక్షించింది. తూర్పు సముద్రంలో ఆ క్షిపణులను ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ విషయాన్ని ద్రువీకరించారు. గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను కూడా ఉత్తర కొరియా పరీక్షించినట్లు జేసీఎస్ తెలిపింది. 
 
జపాన్ కోస్ట్ గార్డ్‌లకు సముద్రంలో ఓ వస్తువును గుర్తించారు. అయితే అది బాలిస్టిక్ మిస్సైల్‌కు చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఉల్లంఘించినట్లు నిపుణులు చెబుతున్నారు.
 
న్యూక్లియర్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బాలిస్టిక్ మిస్సైళ్ల పరీక్షలను యూఎన్ నిషేధించింది. అయితే ఇవాళ జరిగిన పరీక్షలకు సంబంధించి దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఇంకా స్పందించలేదు. రెండు రోజుల క్రితమే నార్త్ కొరియా ఓ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన విషయం తెలిసిందే.
 
ఆ క్రూయిజ్ మిస్సైల్‌.. అణ్వాయుధాలను మోసుకువెళ్లగలదు. క్రూయిజ్ మిస్సైళ్లను యూఎన్ పెద్దగా పట్టించుకోదు. బాలిస్టిక్ మిస్సైళ్లను మాత్రమే ప్రమాదకరంగా భావిస్తారు. ఆ క్షిపణులు అతిపెద్ద సైజులో ఉండే శక్తివంతమైన పేలోడ్లను మోసుకువెళ్లగలవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments