Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా పరికరాలు వాడొద్దు: బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం సూచన

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:53 IST)
ప్రస్తుతం చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దని భారత్‌ సంచార్‌‌ నిగమ్‌ లిమిలెట్‌ (బీఎస్ఎన్‌ఎల్‌)కు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) సూచించింది.

దీనికి సంబంధించి టెండర్‌‌ ప్రాసెస్‌ను కూడా సమీక్షించాలని చెప్పినట్లు అధికారులు చెప్పారు. ఎంటీఎన్‌ఎల్‌కు కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రెడేషన్‌కు చైనా పరికరాలను ఉపయోగించొద్దని అనుబంధ సంస్థ మహానగర్‌‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు డీవోటీ సూచించింది.

సెక్యూరిటీ ఇష్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా తయారు చేసిన సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్‌ ఎప్పటికైనా డేంజరే అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌‌టెయిల్‌, వొడాఫోన్‌, ఐడియా హువాయితో కలిసి పనిచేస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం జెడ్‌టీఈతో కలిసి పనిచేస్తోంది.

కాగా.. చైనాకు చెందిన 52 యాప్‌లు యూజ్‌ చేయడం సేఫ్‌ కాదని, వాటి వాడకాన్ని తగ్గించాలని, లేదా బ్యాన్‌ చేయాలని సూచిస్తూ మన ఇంటెలిజెన్స్‌ అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments