నీరవ్‌కు షాక్.. ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్ సరిపోతుంది.. కోర్టు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:34 IST)
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. 
 
ఇందులో భాగంగా నీరవ్‌ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. భారత్​కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్​ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్​కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు స్పష్టం చేసింది. 
 
నీరవ్​‌కు ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్​ సరిపోతుందని కోర్టు పేర్కొంది. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది. నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని కోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments