Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లోని జైలులో అగ్నిప్రమాదం: 9 మంది సజీవదహనం

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (16:58 IST)
ఫిలిప్పీన్స్‌లోని ఓ జైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. ఈ ప్రాంతం ఆ దేశ రాజధాని మనీలాకి 386 మైళ్ల దూరంలో ఉంది. లేటీ ద్వీపంలోని రీజినల్‌ జైలులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
సైకియాట్రిక్‌ వార్డులో ఈ ప్రమాదం జరగడంతో మృతుల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని ఖైదీలే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగినా దాదాపు 8 గంటల పాటు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయని, ఓ భవనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. 
 
ఈ ఘటనలో తొమ్మిది మంది ఖైదీలు మృతిచెందినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. జైలు వార్డెన్లు ఖైదీలను కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. అర్థరాత్రికి మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments