Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో, ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు.. 80 మందికి పైగా మృతి

నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడిక

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (11:09 IST)
నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. 
 
మరోవైపు టర్కీ ముఖ్యనగరమైన ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలియవచ్చింది. తొలి పేలుడు ఫుట్‌బాల్‌ స్టేడియం బయట జరగగా.. రెండోది ఓ పార్క్‌ ఆవరణలో జరిగినట్లు సమాచారం. 
 
ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments