Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాట్లాండ్‌లో పెళ్లిలో హింస.. తల్లిపైనే వధువు దాడి.. జైలులోనే ఫస్ట్‌నైట్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (17:52 IST)
స్కాట్లాండ్‌లో ఓ జంట పెళ్లి మాత్రం హింసాత్మకంగా మారింది. పెళ్లిలో వధువు తల్లిపై దాడి జరిగింది. దాడి చేసింది కూడా వధువు కావడం విశేషం. 
 
వివరాల్లోకి వెళితే.. బాత్‌గేట్‌లోని బాలన్‌క్రిఫ్ టోల్ వద్ద ఉన్న ది వియూలో క్లారీ (26) ఎమోన్‌లు (30) పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎమోన్ మాజీ బాక్సర్. వీరిద్దరూ ఎంతో సంతోషంగా సాగాల్సిన ఈ వేడుకలో అనుకోకుండా గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
పెళ్లి కూతురే తన తల్లి లిండ్సేపై దారుణంగా దాడి చేసింది. వధువు క్లారీతో పాటు, వరుడు ఎమోన్‌ అతని సోదరుడు కీరన్ కూడా లిండ్సేపై దాడి చేశారు.  దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ ఘటనపై వధూవరులపై లిండ్సే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వరుడు, వధువును, మరో వ్యక్తికి సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. దాంతో తమ మొదటి రాత్రిని జైల్లో గడిపారు. అయితే వారు జైలు నుంచి బయటకు వచ్చారు. 
 
కానీ దీనిపై కోర్టులో విచారణ సాగుతుంది. ఈ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. వారి గత నేర చరిత్రపై కూడా దర్యాప్తు సాగుతోంది. 
 
సోమవారం కోర్టుకు హాజరు కావడానికి ముందు వారు రాత్రంతా సెల్‌లలో గడిపారు. తన తల్లి జుట్టు పట్టుకుని, తలపై, శరీరంపై కొట్టి తన్నినట్లు క్లారీ పోలీసుల ఎదుట అంగీకరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments