Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో నేపాల్ అధ్యక్షుడు అడ్మిట్

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:27 IST)
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మరోమారు ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. గత నెల రోజుల వ్యవధిలో ఆయన ఆస్పత్రిపాలు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
గత కొన్ని రోజులుగా శ్వాస పీల్చడంలో కష్టంగా అనిపించడంతో పౌడెల్‌ను తొలుత ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ బోధనా ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను బుధవారం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 
 
నేపాల్ అధ్యక్షుడు ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా భారత్‌కు తరలించినట్టు అధ్యక్షుడి మీడియా సలహాదారు కిరన్ పోఖరెల్ తెలిపారు. ఆయనతో వెంట కుమారుడు చింతన్ పౌడెల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
కాగా, అధ్యక్షుడు త్రిభువన్ ఆస్పత్రిలో ఉండగా ప్రధాని పుష్పకుమార్ దహాల్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి పూర్ణ బహదూరు ఖడ్కా, ఇతర నేతలు కలిసి పరామర్శించారు. కడుపునొప్పితో బాధపడిన అధ్యక్షుడు పౌడెల్ ఈ నెల ఒకటో తేదీన తొలి ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments