Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలోని శరణార్థ శిబిరంలో అగ్నిప్రమాదం.. మూడు తరాలవారు సజీవదహనం

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (08:50 IST)
గాజాలోని శరణార్థ శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్టుమెంటులో చిన్నారి పుట్టిన రోజు వేడుక రోజున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారుల కూడా ఉన్నారు. 
 
గాజాలోని ఓ శరణార్థ శిబిరంలో ఆనందంగా జరుపుకుంటున్న పుట్టనరోజు వేడుక చివరకి విషాదంగా మిగిలింది. ఈ భవనంలో ఉన్నట్టుండి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం తుడిసిపెట్టుకునిపోయింది. పుట్టిన రోజుల వేడుకలు జరుగుతున్న భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వీటిలో చిక్కుకుని ఏకంగా 21 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
మూడు అంతస్తులన్న భవనంలో అబు రయా అనే వ్యక్తి కుటుంబం ఉంటుంది. ఈయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈజిప్టు నుంచి తమ బంధువు కూడా వచ్చాడు. దీంతో ఈ వేడుకలను వారంతా కలిసి ఆనందంగా జరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకునిపోయింది. మూడు తరాలకు చెందిన ప్రజలు సజీవదహనమయ్యారు. ఇంట్లో అధిక మొత్తంలో నిల్వచేసిన పెట్రోల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని స్థానికులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments