Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి.. తీసుకెళ్లారు.. అలెక్సీ నావల్నీ ఆరోపణ

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:14 IST)
Navalny
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ రష్యా అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్న నేపథ్యంలో.. చికిత్స నిమిత్తం తనను జర్మనీకి పంపిస్తున్నప్పుడు ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపారని పేర్కొన్నారు. తనను జర్మనీకి పంపే ముందు తన దుస్తులను లాగేసుకున్నారు. తనను కోమాలో వుండగా.. ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపించారు. 
 
తన శరీరంపై విషపూరిత రసాయనం ఉన్నట్టు తేలింది. అందువల్ల తన దుస్తులు అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తాయని నావల్నీ పేర్కొన్నారు. రష్యా అధికారులు వెంటనే తన దుస్తులు తనకు పంపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రత్యర్థి అయిన నావల్నీ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
గురువారం సైబీరియాలోని తామ్‌స్క్‌ నుంచి మాస్కోకు ఓ విమానంలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని ఓమ్‌స్క్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం ఎక్కేముందు ఆయన టీ మాత్రమే తీసుకున్నారనీ... బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారని నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments