Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో మోదీ బస

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆయన ఉండేందుకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో బస ఏర్పాటు చేశారు. జెరూసలెం లోని కింగ్‌ డేవిడ్‌ హోటల్‌లో మోదీ ప్రస్త

Webdunia
గురువారం, 6 జులై 2017 (02:52 IST)
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆయన ఉండేందుకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో బస ఏర్పాటు చేశారు. జెరూసలెం లోని కింగ్‌ డేవిడ్‌ హోటల్‌లో మోదీ ప్రస్తుతం ఉంటున్నారు. ఆయన ఉండే సూట్‌ అత్యంత సురక్షితమైనది. బాంబు దాడులు, రసాయనిక దాడులు.. ఇలా ఎలాంటి దాడులు జరిగినా.. మోదీ బస చేసిన సూట్‌ మాత్రం చెక్కుచెదరదని కింగ్‌ డేవిడ్‌ హోటల్‌ ప్రతినిధి షెల్డన్‌ రిట్జ్‌ తెలిపారు. 
 
ప్రధాని మోదీ, తన ప్రతినిధి బృందం ఉండేందుకు దాదాపు 110 గదులను కేటాయించారు. ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైన సూట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు క్లింటన్, బుష్, ఒబామా మాత్రమే ఉన్నారు. వారి తర్వాత ఆ గౌరవం ప్రధాని మోదీకి దక్కడం విశేషం. 
 
మోదీకి ఇష్టమైన గుజరాతీ వంటకాలతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన తినే కుకీస్‌లో కూడా కోడిగుడ్డు, పంచదార లేకుండా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. మోదీ ఉండే సూట్‌కు ప్రత్యేకంగా కిచెన్‌ ఏర్పాటు కూడా ఉంది. ఆయనకు ఎప్పుడు ఏమి తినాలనిపిస్తే అందులో వెంటనే వంట చేసి నిమిషాల్లో అందిస్తారు. 
 
ప్రధాని మోదీ ఉండే ప్రాంతమంతా భారతీయులు ఇష్టపడే పువ్వులతో అందంగా అలంకరించారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments