Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్‌ల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాల్లేవు: ముషారఫ్

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:40 IST)
భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ఆ ప్రచారమంతా ఉత్తదేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య 2002 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తాయని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా గత దశాబ్దకాలంలో భారత్-పాక్ మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైందని ముషారఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించి తర్వాత భారత్-పాక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యుద్ధమంటూ వచ్చి భారత్‌పై పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని, అప్పుడు పాక్ మళ్లీ 50 బాంబులు వేయాల్సి వస్తుందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, అణుయుద్ధం గురించి మాట్లాడేవారికి నిజానికి దానిపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments