Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కనిపిస్తే కరకరమంటూ నమిలేస్తాడు... ఆ తర్వాత?

Webdunia
గురువారం, 4 జులై 2019 (14:30 IST)
సాధారణంగా తేలు కనిపిస్తే మనం దాదాపుగా పరుగుపెడతాం. మనకు అందుబాటులో ఉన్న కర్రతోనో లేదా రాయితోనో కొట్టి చంపేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా ఢిఫెరెంట్. అతను తేళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని తినేస్తాడు. ఇప్పటికే వందలాది తేళ్లను తిన్నాడు. అయితే దాని వల్ల అతడికి ఏమీ కాలేదు. 
 
ఇది తెలిసిన వారు ఆశ్యర్యపోతున్నారు. ఆయన పేరు మాకప్ప. ఆయన కనిపించిన తేళ్లను ఎందుకు తింటున్నాడో అని ఆరా తీయగా.. మాకప్ప ఇరవై సంవత్సరాల క్రితం గుడిసె కప్పుతుండగా ఆయనకు తేలు కుట్టింది. అప్పుడు వైద్యం చేయించుకున్నాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మరో తేలు కుట్టింది. 
 
ఈసారి మాకప్పకు కోపం వచ్చి ఆ తేలును కాస్త నోటిలో వేసుకుని కొరికి నమిలేసాడు. ఈ విధంగా ఓ వంద తేళ్ల వరకు తినేసాడు. ఆ తర్వాత తేళ్లను తినడం అలవాటు చేసుకున్నాడు. ఊళ్లో ఎక్కడ తేలు కనబడినా గ్రామస్థులు వెంటనే ఆయనకు సమాచారం ఇస్తారు. ఇప్పటివరకు ఇలా చేయడం వల్ల తనకు ఇబ్బంది కలగలేదని, అలాగే తన సోదరికి కూడా ఓ సారి రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేసానని మాకప్ప చెబుతున్నాడు. అయితే దీనిని ఎవరూ ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments