Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలిలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ నరమేథం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:43 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేథం సృష్టించింది. 50 మందితో వెళుతున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని ప్రయాణికుల్లో 31 మంది మృత్యువాతపడ్డారు. 
 
దీనిపై బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే స్పందిస్తూ, అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రయాణికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ట్రక్కుకు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో ట్రక్కులో ఉన్న 50 మంది ప్రయాణికుల్లో 31 మంది సజీవదహనమయ్యారని చెప్పారు. 
 
మిగిలిన వారు తీవ్రంగా గాయపడినట్టు వివరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ దారుణ ఘటనకు ఏ ఒక్క ఉగ్రసంస్థ నైతిక బాధ్యత వహించకపోయినప్పటికీ అల్‌ఖైదా అనుబంధ సంస్థే ఈ దారుణానికి పాల్పడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments