Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలిలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ నరమేథం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:43 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేథం సృష్టించింది. 50 మందితో వెళుతున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని ప్రయాణికుల్లో 31 మంది మృత్యువాతపడ్డారు. 
 
దీనిపై బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే స్పందిస్తూ, అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రయాణికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ట్రక్కుకు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో ట్రక్కులో ఉన్న 50 మంది ప్రయాణికుల్లో 31 మంది సజీవదహనమయ్యారని చెప్పారు. 
 
మిగిలిన వారు తీవ్రంగా గాయపడినట్టు వివరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ దారుణ ఘటనకు ఏ ఒక్క ఉగ్రసంస్థ నైతిక బాధ్యత వహించకపోయినప్పటికీ అల్‌ఖైదా అనుబంధ సంస్థే ఈ దారుణానికి పాల్పడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments