Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలాకు అరుదైన గౌరవం.. ఐరాస శాంతి దూతగా ఎంపిక..

నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస స

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (16:07 IST)
నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై మలాలా దృష్టి సారించారని.. అందుకే ప్రపంచ పౌరునికి ఐరాస సెక్రటరీ జనరల్ అందజేసే అత్యున్నత గౌరవాన్ని మలాలాకు అందజేసినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజరిక్ పేర్కొన్నారు. సోమవారం జరిగే కార్యక్రమంలో మలాలాకు ఈ పదవిని అధికారికంగా కట్టబెట్టనున్నారు. 
 
వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేసినా.. అలాంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల నిబద్ధత కనబరచడంతో ఈ అరుదైన ఉన్నత గౌరవం ఆమెకు దక్కిందని తెలిపారు. తద్వారా అతి చిన్న వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా మలాలా రికార్డు సాధించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments