Webdunia - Bharat's app for daily news and videos

Install App

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

సెల్వి
గురువారం, 8 మే 2025 (12:18 IST)
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మలాలా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
భారతదేశం-పాకిస్తాన్ ప్రజలు ఒకరికొకరు శత్రువులు కాదని మలాలా యూసఫ్‌జాయ్ పునరుద్ఘాటించారు. "ద్వేషం- హింస మా ఉమ్మడి శత్రువులు" అని మలాలా చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, పౌరులను ముఖ్యంగా పిల్లలను , రక్షించడానికి, విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండటానికి భారతదేశం-పాకిస్తాన్ నాయకులు చర్య తీసుకోవాలని నేను గట్టిగా కోరుతున్నాను" అని మలాలా అన్నారు. 
 
రెండు దేశాలలోని అమాయక బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మలాలా యూసఫ్‌జాయ్ ఇలా రాసుకొచ్చారు. "ఈ ప్రమాదకరమైన సమయంలో, నేను నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, పాకిస్తాన్‌లో మేము పనిచేసే విద్యావేత్తలు, బాలికల గురించి ఆలోచిస్తున్నాను. 
 
అంతర్జాతీయ సమాజం సంభాషణ, దౌత్యాన్ని ప్రోత్సహించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మలాలా పిలుపునిచ్చారు. "మనందరి భద్రత- శ్రేయస్సు కోసం శాంతి మాత్రమే ముందుకు సాగే మార్గం" అని మలాలా యూసఫ్‌జాయ్ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments