Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృష్టం కలిసొచ్చింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.. లాటరీతో రూ.2862 కోట్లు!!

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా 435 మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. పవర్ బాల్ అనే లాటరీ సంస్థ లాటరీలను విక్రయిస

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (16:24 IST)
అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా 435 మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. పవర్ బాల్ అనే లాటరీ సంస్థ లాటరీలను విక్రయిస్తోంది. ఇలాంటి సంస్థలు ఇండియానా స్టేట్‌లో దాదాపు 30కి మించే వున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మాన్యుఫేక్చరింగ్ కంపెనీలో పనిచేసే కార్మికుడికి ఏకంగా 435 మిలియన్ డాలర్లు (రూ.2862 కోట్లు) లాటరీ ద్వారా దక్కాయి. 
 
దీంతో ఈ లాటరీ రికార్డు సాధించింది. అమెరికా లాటరీ చరిత్రలో ఈ లాటరీ అతిపెద్ద 10వ లాటరీగా గుర్తింపు పొందింది. కానీ ఈ లాటరీలో 435 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి తన పేరు, వివరాలను పవర్ బాల్ సంస్థ.. గోప్యంగా ఉంచింది. లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నట్లు సదరు సంస్థ వ్యక్తికి ఫోన్ చేస్తే లైన్ కలవలేదని, దీంతో లాటరీ గెలుచుకున్న సోదరుడికి విషయం చెప్పినట్లు సంస్థ వెల్లడించింది. 
 
ఈ విషయాన్ని తండ్రి, సోదరుడు చెప్పినా... సదరు వ్యక్తి నమ్మలేదని.. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం అతనికి లాటరీని నిర్వహించిన పవర్ బాల్ సంస్థ పంపిన లేఖ చూపించడంతో లాటరీ గెలిచినట్టు గుర్తించి.. ఎగిరి గంతేశాడని సంస్థ వెల్లడించింది. టాక్స్ పోగా మిగిలిన మొత్తాన్ని కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల చదువు కోసం ఉపయోగిస్తానని లాటరీ గెలిచిన వ్యక్తి తెలిపాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments