రాజద్రోహానికి పాల్పడలేదు.. మరణశిక్ష తొందరపాటు తీర్పు : ముషారఫ్

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (11:25 IST)
తాను అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి రాజద్రోహానికి పాల్పడలేదని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో తనకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం కూడా తొందరపాటేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
దేశద్రోహం నేరం కింద ముషారఫ్‌కు పెషావర్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ముషారఫ్‌ తరపు న్యాయవాది అజార్‌ సిద్దిఖి లాహోర్‌ హైకోర్టులో 86 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని, ఇతరులను ప్రతిపవాదులుగా చేర్చారు. 
 
తీర్పు క్రమరాహిత్యంగా, విరుద్ధ ప్రకటనల మిశ్రమంగా ఉన్నదని, విచారణను వేగంగా, తొందరపాటుతో జరిపారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఎటువంటి చర్యలను ముషారఫ్‌ తీసుకోలేదని అందులో వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన సాక్ష్యాల్లో సైతం అతనిపై రాజద్రోహం నేరం లేదని పేర్కొన్నారు. జస్టిస్‌ మజాహిల్‌ అలీఅక్బర్‌ నఖ్వి నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న ఈ పిటిషన్‌పై వాదనలను విననున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments