Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లో భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి?!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (14:17 IST)
కువైట్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. విదేశీ జనాభా చట్టానికి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ దేశంలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సివుంటుంది. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
కరోనా మహమ్మారి కారణంగా కువైట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. మరోవైపు ఆ దేశంలోని విదేశీయుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. అధికార గణాంకాల ప్రకారం కువైట్‌లో మొత్తం జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. కువైట్‌లోని మొత్తం విదేశీయుల్లో భారతీయుల సంఖ్య 14.5 లక్షలు.
 
కువైట్‌లో స్థానిక జనాభా కంటే విదేశీయుల జనాభా మూడు రెట్లకుపైగా ఉన్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా ఉండేందుకు మొత్తం జనాభాలో విదేశీయుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రధాని షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబా ఇటీవల నిర్ణయించారు. 
 
దీంతో కువైట్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి చెందిన చట్టసభ్యుల కమిటీ ఇటీవల విదేశీయుల జనాభా తగ్గింపునకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం కువైట్‌లో భారతీయుల జనాభాను 15 శాతానికి పరిమితం చేశారు. ఈ బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్‌ను వీడాల్సి ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments