Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్ : రాత్రికి రాత్రే కోటీశ్వరుడు... ఎలా?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (08:04 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరడయ్యాడు. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌ వారిని కోటీశ్వరులు చేసింది. ఆ లాటరీ టిక్కెట్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కష్టాలన్నీ తీరిపోయాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొట్టకూటి కోసం కేరళకు చెందిన సోమరాజన్ అబుదాబికి వెళ్లాడు. ఈయన అబుదాబిలో గత 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే, 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. 
 
జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. పైగా, తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments