Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో మారణహోమం... ఉగ్రదాడిలో 35 మంది మృతి!

అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది.

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (10:43 IST)
అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది. 
 
శనివారం రాత్రి 9 గంటలకు నలుగురు సాయుధులు హోటల్‌లోకి ప్రవేశించారు. అత్యాధునిక ఆయుధాలతోపాటు రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్లతో దాడి చేశారు. ముంబై ముట్టడి తరహాలో దానిని తమ ఆధీనంలోకి తీసుకుని విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. కొంతమందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్‌లోని కొన్ని ఫ్లోర్లకు నిప్పు పెట్టారు. 
 
బహుళ అంతస్తుల హోటల్లో ఉగ్రవాదులు స్వైర విహారం చేస్తున్నారు. కాల్పులకు నాలుగో ఫ్లోర్లో ఉన్న కిచెన్‌ తగలబడింది. దాంతో ఆ అంతస్తు మొత్తానికి నిప్పంటుకుంది. కాల్పుల్లో 15 మంది వరకూ చనిపోయి ఉంటారని సన్‌ పత్రిక పేర్కొంది. మృతుల సంఖ్య 35 దాకా ఉంటుందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ప్రతినిధి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments