Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి చితిపై కోడి మాంసం కాల్చుకుని భక్షించిన కసాయి కొడుకు

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (16:51 IST)
నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని అత్యంత కర్కశంగా చంపేశాడో కసాయి కొడుకు. అంతటితో అతని కసి తీరలేదు. తల్లి శవాన్ని దహనం చేసేందుకు వెలిగించిన చితిపై కోడి మాంసం కాల్చుకుని ఆరగించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ ప్రాంతానికి చెందిన ప్రధాన్ సోయ్ (35) అనే ఉన్మాది మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రధాన్ పట్ల తల్లి సుమీ సోయ్ (60) ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
తల్లి తనను తిట్టడాన్ని భరించలేని ప్రధాన్ ఓ కర్రతో కొట్టడంతో ఆ వృద్ధురాలు మరణించింది. ఆపై తల్లి మృతదేహాన్ని తన ఇంటి పెరట్లో దహనం చేసేందుకు ప్రయత్నించాడు.
 
అంతేకాదు, తల్లి చితి మండుతుండగా, ఆ మంటల్లో కోడి మాంసం కాల్చుకుని తినడం అతని సోదరి సోమ్వారీ కంటబడింది. దాంతో ఆమె స్థానికులకు సమాచారం అందించడంతో, వారు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
పోలీసులు ప్రధాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా, అతడు నాలుగేళ్ల కిందట తండ్రిని కూడా హత్య చేసినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments